వైఎస్ఆర్ సీపీ కార్యకర్తకు చెందిన బత్తాయి చెట్లు నరికివేత

18 Jun, 2014 09:30 IST|Sakshi

అనంతపురం జిల్లా ఎల్లనూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త రామాంజనేయులుకు చెందిన 100 బత్తాయి చెట్లను టీడీపీ నేతలు నరికేశారు. దాంతో ఆస్తి నష్టం లక్షల్లో జరిగిందని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రామాంజనేయులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు