'పశ్చిమ'లో దోపిడి దొంగలు హల్ చల్

30 Oct, 2014 09:02 IST|Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం మండలంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. బోగోలు గ్రామంలోని ఉల్లిపాయల సత్యనారాయణ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చోరబడ్డారు. నివాసంలోని 70  కాసుల బంగారంతోపాటు రూ. 2 లక్షల నగదును అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు సత్యనారాయణకు సమాచారం అందించారు. దీంతో సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అలాగే ములగలం పల్లిలోని బి.పుల్లారావు కుటుంబం ఇంటి బయట నిద్రిస్తుండగా.... ఇదే అదునుగా భావించి దోపిడి దొంగలు అతడి ఇంట్లోకి ప్రవేశించారు.  ఇంట్లోని రూ. 20 వేల నగదు, బంగారు నగదు అపహరించుకునిపోయారు.  గురువారం ఉదయం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన పుల్లారావు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు