ఈనాటి ముఖ్యాంశాలు

7 Feb, 2020 18:40 IST|Sakshi

తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో మనబడి, నాడు-నేడు కార్యక్రమాల పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక, హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా నిలిచిన మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. మరోవైపు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని తొలుత గుర్తించిన చైనా వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ మృతిచెందారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు