రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

28 Nov, 2016 07:02 IST|Sakshi
రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లో ఆయన పర్యటిస్తారు.

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటారు. వీటితో పాటు పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు