తెనాలిలో స్పీకర్ దిష్టిబొమ్మ దహనం

20 Mar, 2015 14:48 IST|Sakshi

గుంటూరు: ఏపీ శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.  తెనాలిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త అన్నాబత్తుని శివకుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
(తెనాలి)

మరిన్ని వార్తలు