ఆత్మకూరు విద్యార్థికి అరుదైన అవార్డు

21 Mar, 2018 09:12 IST|Sakshi
అమర్‌నాథరెడ్డి

ఆత్మకూరు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి.అమరనాథరెడ్డి ఇండియన్‌ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఇస్కా ట్రావెల్‌ అవార్డ్‌కు ఎంపికయ్యాడు. దేశ వ్యాప్తంగా పది మంది విద్యార్థులు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎంపికైంది అమరనాథరెడ్డి ఒక్కరే కావడం గమనార్హం. ఈ నెల 18న జరిగిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో విద్యార్థి తరఫున గైడ్‌ టీచర్‌ మల్లికార్జున ఈ అవార్డును నాగాలాండ్‌ గవర్నర్‌ పద్మనాభ బాలకృష్ణాచారి, మాజీ ఐఎస్‌సీఏ కార్యదర్శి అశోక్‌ కుమార్‌ సక్సేనా చేతుల మీదుగా అందుకున్నట్లు పాఠశాల హెచ్‌ఎం ఏవీఎం రాఘవ తెలిపారు.

మరిన్ని వార్తలు