బిస్క్‌ ఫామ్‌’ విస్తరణ

4 Sep, 2019 10:17 IST|Sakshi

కోలకతాకు చెందిన బేకరీ సంస్థ ‘బిస్క్‌ ఫామ్‌’.. వచ్చే మూడేళ్లలో 3వ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రకటించింది. దేశ బిస్కెట్ల మార్కెట్లో ఈ సంస్థ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌ కే డీ పాల్‌ ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ..  ‘వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరింపచేయనున్నాం. తాజా లోగోను సంస్థ జర్నీని తెలియజేసే విధంగా రూపొందించాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు