ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు

2 Jun, 2016 01:44 IST|Sakshi
ఆహార సంస్థల లెసైన్స్ల గడువు మళ్లీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఆహార కంపెనీలను యధేచ్ఛగా నడుపుకునేందుకు లెసైన్స్ తప్పనిసరి. దీన్ని పొందేందుకు కంపెనీలకు మరో మూడు నెలలు గడువు పొడిగించింది భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). ఈ మేరకు గడువును ఆగస్టు 4 వరకు పొడిగిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖకు వచ్చిన పలు అభ్యర్థనల మేరకు ఇప్పటికే గడువును 8 సార్లు సవరించారు. చివరిసారిగా మే 4తో గడువు ముగిసింది.

మరిన్ని వార్తలు