విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి ప్రారంభం...

26 Jul, 2016 00:41 IST|Sakshi
విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి ప్రారంభం...

హైదరాబాద్: హిందుజా గ్రూపునకు చెందిన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలోని విశాఖపట్నంలో నెలకొల్పిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లో సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక్కోటీ 520 మెగావాట్ల సామర్థ్యంతో హిందుజా ఇక్కడ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ ఎండీ అశోక్‌పురి మాట్లాడుతూ... రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించామని తెలిపారు. మొదటి యూనిట్ ద్వారా జనవరి నుంచే గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఇప్పుడు రెండో యూనిట్ కూడా ఉత్పత్తిని ఆరంభించిందని తెలియజేశారు.

మరిన్ని వార్తలు