డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్‌

2 Mar, 2017 01:11 IST|Sakshi
డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్‌

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ–వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌)లో భారత రాయబారి(భారత శాశ్వత ప్రతినిధి)గా టెలికం కార్యదర్శి జె.ఎస్‌. దీపక్‌ నియమితులయ్యారు. 1982 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దీపక్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2010లో స్పెక్ట్రమ్‌ ఈ–వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్లు విజయవంతంగా రావడానికి ఈయనే ముఖ్య కారణం. ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదివిన దీపక్‌ వాషింగ్టన్‌ డీసీకి చెందిన పాలసీ ప్రాజెక్ట్‌కు కన్సల్టెంట్‌గా పనిచేశారు.

మరిన్ని వార్తలు