మరో 8మంది అధికారులపై వేటు

16 Feb, 2018 16:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్‌బీ స్కాంలో తాజాగా మరో  ఎనిమిదిమంది అధికారులపై  వేటు పడింది.  అనుమానిత లావాదేవీలు జరిపారన్న ఆరపణలతో ఒక జనరల్‌ మెనేజర్‌ సహా ఎనిమిదిమందిని సస్పండ్‌ చేసినట్టు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ మెగా స్కాంలో  మొత్తం సస్పెండ్‌ అయిన పీఎన్‌బీ అధికారులు సంఖ్య 18కి చేరింది.

ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి ఇతర బ్యాంకుల పూర్తి బకాయిలను చెల్లించాల్సిన నేపథ్యంలో అంతర్గత వనరుల ద్వారా  నిధులు సమకూరుస్తామని కూడా ఆ అధికారి తెలిపారు.  మరిన్ని వివరాలను వెల్లడించేందుకు సంబంధిత 36 అకౌంట్ ఖాతాలపై దర్యాప్తు చేయనుందని తెలిపారు.  దర్యాప్తు నివేదిక ఆధారంగా   ఎల్‌వోయూ ( బ్యాంకింగ్ పరిభాషలో ఎల్‌వోయూ అనేది ఇతర బ్యాంకుల శాఖలకు ఒక బ్యాంక్ జారీచేసే ఒక హామీ. ఈ ఎల్‌ఓయూ ద్వారా విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను  అందిస్తాయి) కింద  క్రెడిట్‌ అయిన నిధులను పూర్తిగా చెల్లిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పీఎన్‌బీకి రూ. 5,473 కోట్లను ప్రకటించినట్టు చెప్పారు.   

మరిన్ని వార్తలు