లాభాలకు బ్రేక్ : 32 వేల దిగువకు సెన్సెక్స్ 

29 May, 2020 09:38 IST|Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.  ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయిన  సెన్సెక్స్ ప్రస్తుతం 293పాయింట్లు నష్టంతో 31907 , నిఫ్టీ 68 పాయింట్లు బలహీనంతో 9421 వద్దకొనసాగుతున్నాయి.  తద్వారా  మూడు రోజుల లాభాలకు  బ్రేక్ చెప్పాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఆసియన్ మెయింట్స్ , భారతి ఇన్ ఫ్రాటెల్,  గ్రాసిం, అల్ట్రా టెక్ సిమెంట్, సిప్లా,సన్ ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి.  లుపిన్,  యాక్సిస్ , ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఇండస్  ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్, మారుతి, టాటా స్టీల్ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు