యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పక్కనే ఉన్న గ్రామస్తులు గమనించి హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తల్లి భారతి, పిల్లలు పల్లవి, వైష్ణవి, ఉదయ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన కోసం హైదరాబాద్కు తరలించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.