150 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్

15 Sep, 2016 11:25 IST|Sakshi

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు