డీఈఈసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు

9 Aug, 2016 23:02 IST|Sakshi
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్‌) :
బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్‌)లో డీఈఈసెట్‌–2016లో అర్హత సాధించి డీఎడ్‌ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్‌ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్‌ జయప్రకాశరావు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు