వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు

14 Sep, 2016 19:04 IST|Sakshi
శ్రీనగర్‌ కాలనీలో 56 రకాల నైవేధ్యం సమర్పించిన భక్తులు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండపాల్లో కొలువైన గణనాథుడికి భక్తులు పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అలాగే అన్నదానాలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు.

మరిన్ని వార్తలు