చెట్టు నరుకుతుండగా కరెంట్‌ షాక్‌తో..

31 Aug, 2016 00:26 IST|Sakshi
జంగారెడ్డిగూడెం: విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక శేషాద్రినగర్‌ సమీపంలో ఓ రైతు వద్ద శ్రీనివాసపురం గ్రామానికి చెందిన గోపిశెట్టి సిద్దారావు (31) కూలీగా పనిచేస్తున్నాడు. రైతు పొలంలో సుబాబుల్‌ చెట్టును మంగళవారం సాయంత్రం సిద్దారావు నరుకుతున్నాడు. వర్షం కారణంగా చెట్టు తడిగా ఉంది. చెట్టు నరుకుతున్న సమయంలో విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌ ప్రవహించి సిద్దారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్దారావు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్లి పరిశీలించగా అతను మృతిచెంది కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు