విద్యుదాఘాతంతో గేదెలు మృతి

1 Aug, 2016 22:40 IST|Sakshi
విద్యుదాఘాతంతో గేదెలు మృతి

నకిరేకల్‌ : విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని ఓగోడు గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచ్‌ దోరపల్లి యాదగిరిగౌడ్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన మాద వెంకన్న, శాంతరాజు రాంబాబులకు చెందిన పాడి గేదెలు మూసీనది ఎగువ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి మేత వేస్తున్న పాడి గెదులు అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్పంచ్‌ దోరపల్లి యాదగిరిగౌడ్, బాధితులు ఆరోపించారు. ఒక్కో గేదె విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు