సీఎంకు సీపీఎం కార్యదర్శి మధు హెచ్చరిక
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా తీసుకురాకుంటే ప్రజలు రాష్ట్రంలో తిరగనివ్వరని సీఎం చంద్రబాబును సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి. మధు హెచ్చరించారు. హోదా కోసం ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకతాటిపై కదులుతున్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చంద్రబాబుకు హితవు పలికారు. విభజన హామీల అమలు కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి మధు ప్రారంభించారు.