డీఈడీ కళాశాలలో ఫుడ్‌ మేళా

3 May, 2017 22:09 IST|Sakshi
డీఈడీ కళాశాలలో ఫుడ్‌ మేళా
దెందులూరు: ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమేనని దెందులూరు విజయ్‌ నగేష్‌ డీఈడీ కళాశాల కాలి అనిల్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కళాశాలలో కరస్పాండెంట్‌ సుగ్గిశెట్టి నూకరాజు అధ్యక్షతన ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. డీఈడీ విద్యార్థులు ఐదు గ్రూపులుగా ఏర్పడి ఐదు విభాగాల్లో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఆడిటోరియం హాల్‌లో ప్రదర్శించారు. పిండి పదార్థాలు, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు కలిగి ఉన్న వివిధ రకాలు ఆహార పదార్థాలను తయారు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ సుగ్గిశెట్టి సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు