అందుబాటులో గడ్డి విత్తనాలు

26 Aug, 2016 22:40 IST|Sakshi

అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యకేంద్రాల్లో రాయితీ గడ్డి విత్తనాలు అందుబాటులో పెట్టామని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ కె.జయకుమార్, పశుగ్రాసం విభాగం ఏడీ డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. కిలో మొక్కజొన్న విత్తనాలు పూర్తి విలువ రూ.49 కాగా అందులో రైతు వాటా రూ.12.25గా చెల్లించాలన్నారు.

అలాగే సీఎస్‌హెచ్‌ ఎంఎఫ్‌–24 రకం జొన్న విత్తనాలు కిలో పూర్తి విలువ రూ.56 కాగా అందులో రైతు రూ.14.10 ప్రకారం చెల్లించాలని తెలిపారు. ఇక సుగర్‌గ్రేజ్‌ జొన్న విత్తనాలు కిలో రూ.337 కాగా అందులో రైతు వాటాగా రూ.84.25 చెల్లించాలని సూచించారు.

మరిన్ని వార్తలు