-
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని వైకుంఠ్పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్సేల్లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
విశాఖ జిల్లా వాసులకు శుభవార్త : పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్న వేళ విశాఖ జిల్లాలోని భూగర్భ జలాలు ఊరటనిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉంటూ జనానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్లో ఆ పరిస్థితి లేదు. నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. భూగర్భ జల వనరులు, జలగణన శాఖ తరచూ నీటి మట్టాలను పరిశీలిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల ద్వారా వాటి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. భూగర్భ శాఖ జిల్లాలో నమోదు చేసిన వివరాల ప్రకారం మార్చి ఆఖరి వరకు భీమిలి మండలం చుక్కవానిపాలెంలో భూగర్భ జలాలు అత్యంత పైన అంటే మూడు మీటర్లకంటే తక్కువ లోతులోనే లభ్యమవుతున్నాయి. ఎండాడ ప్రాంతంలో అత్యంత దిగువన అంటే 19.35 మీటర్ల లోతు వరకు లభ్యం కావడం లేదు. 0–3 మీటర్ల మధ్య చుక్కవానిపాలెంతో పాటు చిప్పాడ, పాలవలస, నరవ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 3–10 మీటర్ల మధ్య నీటి లభ్యత పందలపాక, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, నగరంపాలెం, అగనంపూడి, బీహెచ్పీవీ, గొల్లలపాలెం, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, పాండ్రంగి, టి.దేవాడ, స్టీల్ప్లాంట్, అప్పుఘర్, విశాలాక్షినగర్, పాండురంగాపురం, మధురవాడ, మారికవలస, తాటిచెట్లపాలెం ప్రాంతాలున్నాయి. కణితి కాలనీ, పెందుర్తి, ఆరిలోవ, పెద్ద రుషికొండ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్కు ప్రాంతాలు 10–20 మీటర్ల లోతులో నీటిమట్టాలున్నాయి. హెచ్చుతగ్గులు ఇలా.. మార్చి నెలలో విశాఖ జిల్లాలో సగటు నీటిమట్టం 7.48 మీటర్లుగా ఉంది. గత ఏడాది మార్చిలో 6.82 మీటర్లలో ఉండేది. గత మార్చితో పోల్చుకుంటే స్వల్పంగా 0.66 మీటర్ల దిగువకు వెళ్లినట్టయింది. గత సంవత్సరం మార్చితో భూగర్భ జలాల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 31 పీజోమీటర్లకు గాను 14 చోట్ల పెరగ్గా, 17 చోట్ల దిగువకు వెళ్లాయి. వీటిలో శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, చుక్కవానిపాలెం, నగరంపాలెం, గొల్లలపాలెం, కణితి కాలనీ, పాండ్రంగి, పాలవలస, టి.దేవాడ, నరవ, పెందుర్తి, స్టీల్ప్లాంట్, మారికవలస ప్రాంతాల్లో నీటిమట్టాల స్థాయి పెరుగుదల కనిపించింది. అలాగే పందలపాక, చిప్పాడ, అగనంపూడి, బీహెచ్పీవీ, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, ఏపీటీడీసీ, ఆరిలోవ, బీవీకే కాలేజీ, యోగా విలేజీ, పెద్ద రుషికొండ, ఎండాడ, మధురవాడ, ఏపీఎస్ఐడీసీ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్క్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి. జిల్లా మొత్తమ్మీద 20 మీటర్లకంటే దిగువన నీటిమట్టాలున్న ప్రాంతాలు ఒక్కటీ లేకపోవడం విశేషం! భూగర్భ జలాల సంరక్షణ అవసరం భూగర్భ జలాలనూ అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. వర్షం నీరు వృథాగా పోకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వేసవిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. – లక్ష్మణరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి సగటు భూగర్భ జలాల లభ్యత మండలాల వివరాలు ఇలా.. 3 నుంచి 8 మీటర్ల లోపలే ఆనందపురం, భీమిలి, గాజువాక, ములగాడ, పద్మనాభం, పెందుర్తి, గోపాలపట్నం, పెదగంట్యాడ 8 నుంచి 20 మీటర్ల లోపు మహారాణిపేట, సీతమ్మధార విశాఖపట్నం రూరల్ -
హైదరాబాద్ లో జియో 5G ఫ్రీ ..!
-
అయ్యప్ప భక్తులకు తపాల శాఖ తీపికబురు
సాక్షి, వరంగల్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలై దేవస్థానం వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ(పోస్టాఫీస్) ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం రూ.450లకు అందించనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి ప్రసాదం కావాలనుకునే భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రూ.450 చెల్లించి అరవాన్న ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదాలు జనవరి 16 వరకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చదవండి: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement