పట్టుబడిన జేబు దొంగలు

25 Jul, 2016 00:01 IST|Sakshi
పార్వతీపురం : పట్టణ పోలీసులకు ఆదివారం ఇద్దరు జేబుదొంగలు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి పట్టణ ఎస్సై బి.సురేంద్రనాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు దొంగలు తన జేబు నుంచి రూ. 10,500 కాజేశారని గుమ్మలక్ష్మీపురానికి చెందిన బిడ్డిక నిర్మల్‌కుమార్‌ శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన సొండి గుసయ్య, సొండి క్రాంతి అనే ఇద్దరు జేబు దొంగలను అనుమానించి ప్రశ్నంచగా ఆ దొంగతనం తామే చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 
మరిన్ని వార్తలు