పాఠశాల భవనం పెచు​‍్చలూడి విద్యార్థులకు గాయాలు

30 Jun, 2017 22:28 IST|Sakshi
గాయపడిన విద్యార్థి శివరాజును పరామర్శిస్తున్న ఎంఈఓ కె.ఈరన్న
మంత్రాలయం రూరల్‌ : ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. మండలం పరిధిలోని చౌళహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  తరగతి గదిలో పిల్లలు చదువుకుంటుండగా ఉన్నట్టుండి పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ సంఘటనలో  మూడోతరగతి చదవుతున్న శివరాజుకు తీవ్ర గాయాలు కాగా, నాలుగోతరగతి చదువుతున్న నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు  చికిత్స నిమిత్తం వారిని ఎమ్మిగనూరులో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాధికారి  కె. ఈరన్న ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. టీచర్లను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు