టీడీపీ నేతపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

19 Jul, 2016 15:00 IST|Sakshi

మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రామిరెడ్డిపై మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక తహశీల్దార్ వర్మ ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని మంత్రాలయం తహశీల్దార్ వర్మ, కొందరి ట్రాక్టర్‌లకు జరిమానా విధించాడు. ఈ విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న మాజీ ఎంపీపీ రామిరెడ్డి తహశీల్దార్‌పై దురుసుగా ప్రయత్నించి దాడికి యత్నించాడు. దీంతో తహశీల్దార్ వర్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు