బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత | Sakshi
Sakshi News home page

బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత

Published Tue, Jul 19 2016 2:59 PM

బోనాలకు 3వేలమంది పోలీసులతో భద్రత - Sakshi

హైదరాబాద్ : నగరంలో బోనాల సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బోనాలు సందర్భంగా 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బోనాలకు షీ టీమ్స్తో పాటు, యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే వంద అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, దేవాలయానికి ఒక ఎస్ఐ చొప్పున ఇన్ఛార్జ్గా నియమించినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా ఈ నెల 24,25న సికింద్రాబాద్, 31, ఆగస్టు 1న లాల్ దర్వాజా బోనాలు జరగనున్న విషయం తెలిసిందే.


 

Advertisement
Advertisement