గోదావరిలో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతైన సంఘటన అదిలాబాద్ జిల్లా మామడ మండలం ఆదర్శ్నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్రెడ్డి(20) శివారులోని నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసుల సాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.