ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ

20 Sep, 2016 04:10 IST|Sakshi
ఏలూరు అర్బన్‌  : ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలో దాచుకున్న బంగారు నగలు దోచుకుపోయారు. దీంతో బాధితులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎన్‌.రాంబాబు కథనం ప్రకారం.. జమ్ము కామనాయుడు వృత్తిరీత్యా చుట్టల వర్కర్‌. స్థానిక నల్లదిబ్బ, జండాచెట్టు సెంటర్‌లో భార్యాబిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

భార్యాభర్తలిద్దరూ ఆదివారం ఇంటికి తాళాలు వేసుకుని చుట్టల పనికి వెళ్లారు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఆదుర్దా పడుతూ ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువాలో దాచుకున్న రెండున్నర కాసుల బంగారునానుతాడు అపహరణకు గురైందని గుర్తించారు. దీంతో బాధితులు సోమవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎన్‌.రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు