రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

21 Mar, 2016 08:05 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదమర్రి మండలం ముత్తురపల్లి దగ్గర సోమవారం వేకువజామున బొలేరో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను మునిరెడ్డి, బాలకృష్ణ, సురేష్లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సింగబల్ల గ్రామ సర్పంచి పరిస్థితి విషమంగా మారింది. అతడిని తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు