-
నేడు వేల్పూర్లో అంత్యక్రియలు
వేల్పూర్:
మిషన్ భాగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తండ్రి టీఆర్ఎస్ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్రెడ్డి(74) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో మరణించారు. ఆయన అనారోగ్యంతో రెండు వారాలుగా స్టార్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి, చికిత్స అందించారు. శరీరం సహకరించకపోవడంతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సురేందర్ రెడ్డి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం వేల్పూర్లో అంత్యక్రియలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. 1942 డిసెంబరు 8న వేముల నర్సారెడ్డి, గంగవ్వ దంపతులకు సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయనకు ఒక అక్క, ఐదుగురు చెల్లెల్లు ఉన్నారు. వీరిలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన ్నపూర్ణమ్మ ఒకరు. ఆయన విద్యాభ్యాసం హెచ్ఎస్సీ వరకు వేల్పూర్ హైస్కూలులో సాగింది. డిగ్రీ నిజాంకాలేజీలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఆయనకు భార్య మంజుల, కొడుకులు వేముల ప్రశాంత్రెడ్డి, వేముల అజయ్రెడ్డి, కూతురు రాధిక ఉన్నారు.