కారేపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సీతారాంపురం శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఖమ్మం- ఇల్లందు జాతీయ రహదారిలోని కొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కామేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వాంకుడోతు సక్రీ(42)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.