ప్రత్యేక బృందాలతో గాలింపు జరపండి: చినరాజప్ప

29 Dec, 2017 14:40 IST|Sakshi

కాకినాడ: రాజమండ్రి లాలాచెరువు వద్ద ముస్లిం మత గురువు ఫారూఖ్ హత్య ఘటనపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. దీనిపై జిల్లా ఎస్పీతో ఫోనులో మాట్లాడారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు జరపాలని ఆదేశించారు. హత్యను ఆయన ఖండించారు. కాగా, ఫారుఖ్ హత్యను ముస్లింలు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు రాజమండ్రిలో మెయిన్ రోడ్డులోని పెద్ద మసీదు మద్ద వరు నిరసన తెలిపారు. 

మరిన్ని వార్తలు