న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజ మోహన్రెడ్డి బుధవారం లోక్సభలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 25 వేల ఎకరాల్లో ఆక్వా దెబ్బతిందని తెలిపారు.
రూ. 1700 కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందని చెప్పారు. రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సదరు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.