హైదరాబాద్: నగరంలోని కాచిగూడ రిలయన్స్ డిజటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం మాల్లో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.