ఈసారి వైభవంగా బోనాల పండుగ

22 Jun, 2015 18:21 IST|Sakshi

హైదరాబాద్: ఈ సారి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే నెల 25న గోల్కొండ బోనాలు ఉంటాయని, ఆగస్టు 2, 3న సికింద్రాబాద్లో బోనాలు ఉంటాయని చెప్పారు. ఇక ఆగస్టు 9, 10లలో హైదరాబాద్లో బోనాల పండుగ ఉంటుందని ఆయన వివరించారు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధలతో బోనాల పండుగను జరపనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు