సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు, రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో ముఖాముఖిగా మాట్లాడతారు.
గురువారం కూనవరం మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ కూడా ఆయన పోలవరం బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి గిరిజనుల ఆరోగ్య సమస్యలను కూడా అడిగి తెలుసు కుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మంగళవారం వెల్లడించారు.