'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

28 Mar, 2016 09:22 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వ చర్యలపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన అనంతరం అగ్రీగోల్డ్ అంశాన్ని చర్చిద్దామన్న స్పీకర్ ఏకపక్షంగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వాయిదా తీర్మాణంపై చర్చను ప్రారంభించాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 5 నిమిషాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు