'సర్కార్ ను నిద్ర లేపేందుకే వైఎస్ జగన్ జలదీక్ష'

13 May, 2016 14:27 IST|Sakshi

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలదీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వేణు గోపాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిద్రిస్తున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. అయిదుకోట్ల ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే దీక్ష అని అన్నారు.

తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై  ఈ నెల 16,17,18న వైఎస్ జగన్ కర్నూలులో జలదీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచన తప్ప...ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. తాత్కాలిక ప్రయోజనాల కాదని, శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు.  జలదీక్ష సందర్భంగా ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఇకనైనా చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

>
మరిన్ని వార్తలు