న్యూజిలాండ్లో భారతీయ విద్యార్థి దుర్మరణం

12 Mar, 2014 17:20 IST|Sakshi

వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మరణించాడు. సిద్ధాంత్ శర్మ అనే 21 విద్యార్థి మంగళవారం మరో ముగ్గురితో కలసి పడవలో ఓ సరస్సులో విహారానికి వెళ్లాడు. ఈత కొట్టేందుకు సరస్సులో దూకిన అతను సురక్షితంగా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఓ విదేశీ టూరిస్ట్ సరస్సులోకి దూకి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న శర్మను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం హామిల్టన్కు తరలించినా ఫలితం దక్కలేదు. బుధవారం అతను మరణించాడు.

మరిన్ని వార్తలు