చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో

13 Jan, 2017 12:10 IST|Sakshi
చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో

న్యూఢిల్లీ : చైనా మాంజాపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌జీటీని ఆశ్రయించాలని సూచించింది. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాకు అనుమతి ఇవ్వాలంటూ గుజరాత్‌ కు చెందిన వ్యాపారుస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కాగా మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను ఎన్జీటీ దేశవ్యాప్తంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఉత్తర్వులతో రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి.

మరిన్ని వార్తలు