బెస్ట్ హోటళ్లు ఉదయ్‌పూర్‌లోనే!

26 May, 2014 01:44 IST|Sakshi
బెస్ట్ హోటళ్లు ఉదయ్‌పూర్‌లోనే!

ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ హోటళ్లు
 
ముంబై: భారత్‌లోకెల్లా అత్యుత్తమ హోటళ్లు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనే ఉన్నాయట! ట్రివాగో అనే ఆన్‌లైన్ హోటల్ శోధనా వెబ్‌సైట్ నిర్వహించిన ఓ సర్వేలో ఇది స్పష్టమైంది. 200 ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ల ద్వారా చేసిన ఈ సర్వేలో 8.2 కోట్ల రివ్యూలను పరిశీలించిన తర్వాత ఆ మేరకు ర్యాం కింగ్‌లు ఇచ్చినట్లు ట్రివాగో తెలిపింది. 60కు మించిన రివ్యూలు కలిగిన హో టళ్లు, 30 హోటళ్లకు మించిన నగరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.

అత్యుత్తమ హోటళ్లున్న తొలి 10 నగరాల్లో మొదటి స్థానం లో ఉదయ్‌పూర్, తర్వాత స్థానంలో జైపూర్ నిలిచింది. రాజస్థాన్‌లోనే ఉన్న జోధ్‌పూర్ నాలుగో స్థానం దక్కించుకుంది. కొచ్చి మూడోస్థానంలో, పనాజి ఐదు, సిమ్లా ఆరు, పుణె ఏడు స్థానాల్లో నిలవగా.. హైదరాబాద్ ఎనిమిదో స్థానాన్ని, బెంగళూరు తొమ్మిది, ముంబై పదో స్థానాన్ని దక్కించుకున్నాయి.
 

మరిన్ని వార్తలు