దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్‌ చేశారు

20 Jul, 2017 12:38 IST|Sakshi
దారుణంగా కొట్టి, వీడియో పోస్ట్‌ చేశారు

లక్నో: ఉత్తరప్రదేశ్‌  మహరాజ్‌ గంజ్‌లో  దారుణం చోటు  చేసుకుంది.  అడవికి వెళ్లిన ఓ జంటపై ముగ్గురు  గుండాలు విరుచుకు పడ్డారు.  అతిదారుణంగా  వీరిద్దరిపై దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే  కట్టెలకోసం అడవికి వెళ్లిన  జంటను ఈ  దుర్మార్గులు టార్గెట్‌ చేశారు.  వారిని అడ్డుకుని గూండాల్లాగా దాడి చేశారు. ఈ మొత్తం సంఘటనను  కెమెరాలో చిత్రించారు. అక్కడితో వీరి దౌర్జన్యం, దురాగతాలు ఆగలేదు.  బలవంతంగా బాధితులిద్దర్నీ నగ్నంగా చేసి మరీ వీడియో తీశారు. 

ఈ సంఘటనపై   పోలీసులు  ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.  మోరల్‌ పోలీసింగ్‌ ఆరోపణలతోఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.  ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు