పెళ్లిలో గన్ పేలి కానిస్టేబుల్ మృతి

8 Mar, 2016 04:00 IST|Sakshi

మెయిన్‌పురి: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. బోగాం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రసింగ్(45) అనే కానిస్టేబుల్ కూతురు పెళ్లి సందర్భంగా ఆనందోత్సాహాలతో పలువురు తుపాకులతో గాలిలో కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ రాజేంద్రసింగ్‌పైకి దూసుకురావడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజేంద్రసింగ్ కొంతకాలంగా బుదాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు