కాలేజీలో విద్యార్థిని కాల్చివేత

2 Apr, 2015 04:28 IST|Sakshi
కాలేజీలో విద్యార్థిని కాల్చివేత

తనతో స్నేహానికి తిరస్కరించిందనే కోపంతో కాలేజీ అటెండర్ ఒకడు కాలేజీలోనే ఓ యువతిని కాల్చి చంపాడు.

బెంగళూరులోని ప్రగతి కాలేజీలో 12వ తరగతి చదువుతున్న గౌతమిని(18) అటెండర్ మహేశ్ మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అతడు పక్క గదిలోకి వెళ్లి గౌతమి స్నేహితురాలైన శిరీషపైనా కాల్పులు జరిపాడని, ఆమె గాయపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మహేశ్‌ను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గౌతమిది  కర్ణాటకలోని తుముకూరు జిల్లా అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు