జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాది అరెస్ట్

15 May, 2016 09:57 IST|Sakshi
శ్రీనగర్: పఠాన్ కోట్ దాడిలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న  జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద ఆత్మాహుతి దళానికి చెందిన అబ్దుల్ రహ్మాన్ ఖాన్ గా గుర్తించారు.  

అతని నుంచి ఒక ఏకే 47 గన్,నాలుగు గ్రనెడ్లు, ఒక వైర్ లెస్ సెట్, నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఆర్మీజాయింట్ ఆపరేషన్ల సమయంలో అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.  పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఆత్మాహుతి దళంలో శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు