నేటి నుంచి ప్రధాని గల్ఫ్‌ పర్యటన

23 Aug, 2019 06:41 IST|Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: మన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. 23న యూఏఈలోని అబుదాబిలో, 24న బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. యూఏఈ, బహ్రెయిన్‌లో మన దేశ పారిశ్రామికవేత్తల కోసం జారీ చేయనున్న రూపే కార్డును ప్రధాని ఆవిష్కరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్‌ యూఏఈ’ పురస్కారాన్ని అందజేయనుంది. కాగా, బహ్రెయిన్‌లో పర్యటించనున్న మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు, ఇతర శాఖల మంత్రులు మాత్రమే బహ్రెయిన్‌లో పర్యటించారు.

మరిన్ని వార్తలు