వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. షర్మిల సోమవారం తిరుపతిలో ప్రారంభించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. లీలామహల్ సెంటర్ జనసంద్రమైంది. సాయంత్రం 4 గంటల నుంచి వేలాదిమంది జనం షర్మిల కోసం వేచి ఉన్నారు. ఆమెను చూసిన వెంటనే జయజయధ్వానాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలసి వచ్చిన షర్మిలను చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. సోమవారం ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులువైఎస్సార్ను తలచుకుని కంటతడి పెట్టిన విజయమ్మ, షర్మిలసోమవారం రాత్రి తిరుపతిలో బస్సు యాత్ర సందర్భంగా అభివాదం చేస్తున్న షర్మిల, విజయమ్మసోమవారం తిరుపతిలో జరిగిన బహిరంగసభకు హాజరైన జన సందోహంలో ఒక భాగం. (ఇన్సెట్లో) అభివాదం చేస్తున్న షర్మిల. చిత్రంలో విజయమ్మ, భూమన, చెవిరెడ్డిషర్మిల, విజయమ్మలకు సాదర స్వాగతం పలుకుతున్న జనంబస్సు దిగుతూ అభివాదం చేస్తున్న షర్మిల