సాక్షి, కృష్ణా : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 141వ రోజు ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది.
అనంతరం నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్కు చేరుకుని వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగిస్తారు.