తమిళనాడులో ఉగ్రవాదులు: కేంద్రమంత్రి

23 Jun, 2018 04:14 IST|Sakshi
పొన్‌ రాధాకృష్ణన్‌

నాగర్‌కోయిల్‌: తమిళనాడులో ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఆరోపించారు. ఈ సంఘవిద్రోహ శక్తుల్ని ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రనిరసన తెలిపిన అన్నాడీఎంకే మంత్రులు, రాష్ట్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రమూకల చేతిలో తమిళనాడు నాశనమైపోవడాన్ని ఓ తమిళుడిగా తాను చూడలేను’ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు