‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌

18 Feb, 2017 00:14 IST|Sakshi
‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌

హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్‌కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ‘ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ’కి ఆయన భారత జట్టు తరఫున పరిశీలకుడిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చాముండికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి 11 మంది షట్లర్లు పాల్గొంటున్నారు.

మార్చి 7 నుంచి 12 వరకు బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన చాముండి ప్రస్తుతం హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంగ్లండ్‌లోనే జరిగిన 2009 టి20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు